తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజలకు మరింత చేరువగా కొవిడ్ టీకా పంపిణీ... సర్కారు నిర్ణయం

కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులు కలిపి మొత్తంగా 225 దవాఖానాల్లో.. ప్రైవేటులో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుసంధానంగా ఉన్న 179 ఆసుపత్రుల్లో కొవిడ్‌ టీకాలను ఇస్తుండగా.. వీటి పరిధిని మరింత విస్తరించాలని సర్కారు తీర్మానించింది.

By

Published : Mar 16, 2021, 4:58 AM IST

ప్రజలకు మరింత చేరువగా కొవిడ్ టీకా పంపిణీ... సర్కారు నిర్ణయం
ప్రజలకు మరింత చేరువగా కొవిడ్ టీకా పంపిణీ... సర్కారు నిర్ణయం

కొవిడ్‌ టీకాల పంపిణీని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులు కలిపి మొత్తంగా 225 దవాఖానాల్లో.. ప్రైవేటులో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుసంధానంగా ఉన్న 179 ఆసుపత్రుల్లో కొవిడ్‌ టీకాలను ఇస్తుండగా.. వీటి పరిధిని మరింత విస్తరించాలని సర్కారు తీర్మానించింది. ఆరోగ్యశ్రీ ట్రస్టుకు అనుసంధానంతో సంబంధం లేకుండా.. కనీసం 20 పడకలున్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ టీకాలను ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది.

మరో 1,000...

ఈ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా మరో 1,000 వరకూ ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తద్వారా మండలాల్లోని నర్సింగ్‌ హోంలు, చిన్న ఆసుపత్రుల్లోనూ కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రైవేటు దవాఖానాల జాబితాను ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. ఈ విషయంపై సోమవారం ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ఇప్పటికే 100కి పైగా ఆసుపత్రులు తమ వద్ద పంపిణీకి అనుమతించాలని దరఖాస్తు చేసినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.
సాధ్యమైనంత వేగంగా..

రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడినవారు ఇప్పటికే 1,64,484 మంది.. 45-59 ఏళ్ల కేటగిరీలో 53,921 మంది తొలిడోసు టీకాను పొందారు. ఈ రెండు కేటగిరీల్లోనూ ప్రభుత్వ వైద్యంతో పోల్చితే.. ప్రైవేటులో అధికంగా టీకాలను స్వీకరించారు. ప్రైవేటులో టీకా పొందితే.. ఒక్కో డోసుకు రూ.250 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పంపిణీ కేంద్రాల సంఖ్య ప్రైవేటులో తక్కువగా ఉన్నా.. రుసుము చెల్లించాల్సి వచ్చినా కూడా వాటిల్లో టీకాలను పొందడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య దాదాపు 40 శాతానికి పైగా అధికంగా ఉంది.

ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి. చిన్న ఆసుపత్రుల్లో టీకాలను అందించినా.. దుష్ఫలితాల చికిత్సలపై ఇప్పుడు కొనసాగిస్తున్న విధానాలనే అనుసరించనున్నారు. 3 గదుల విధానాన్ని, టీకా పొందిన తర్వాత 30 నిమిషాల పాటు వేచిచూడడం.. ఏమాత్రం అస్వస్థతగా అనిపించినా సత్వరమే చికిత్స అందించడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రులకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఒకవేళ తీవ్ర దుష్ఫలితాలు ఎదురైనా సత్వరమే తరలించేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్సకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నాయి.

ఇదీ చదవండి:బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు

ABOUT THE AUTHOR

...view details