తెలంగాణ

telangana

ETV Bharat / state

కంపు కొడుతోన్న సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​ ప్రాంగణం - telangana news

ఓ వైపు కరోనా కేసులు విజృంభిస్తుంటే మరోవైపు పరిశుభ్రత కరవై జనాలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ పరిధిలో ఇలాంటి దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.

dirty coop in Secunderabad railway station area
మురికి కూపంగా సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్ ప్రాంగణం

By

Published : Apr 25, 2021, 3:50 PM IST

కరోనా రెండో దశ కోరలు చాస్తుంటే.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాత్రం పరిశుభ్రత లోపించి ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. స్టేషన్​ ఎదుట ఫుట్​పాత్​ల వద్ద ఎక్కడికక్కడా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో వలస కార్మికులు ఇంటిబాట పడుతున్నారు. ఫుట్​పాత్​ల వద్ద వేచి ఉండే సమయంలో అక్కడ ఉన్న చెత్త, మురికి నుంచి దుర్వాసన వస్తున్నట్లు ప్రయాణికులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు రైల్వేస్టేషన్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:తెలంగాణలో ఆస్పత్రులు ఎంత భద్రం?

ABOUT THE AUTHOR

...view details