తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే పాఠ్యపుస్తకాల ముద్రణ వేగంగా సాగుతోంది. మార్చి నెలాఖరు వరకు పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరనున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ నాటికి జిల్లా కేంద్రాల నుంచి ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు పుస్తకాలను మండలకేంద్రాలకు, పాఠశాలలకు తీసుకెళ్తారు. ఈ సారి ఆగస్టులోనే కాగితాన్ని కొనుగోలు చేసినందున టన్ను రూ.66,400కు లభించడంతో గత ఏడాది కంటే రూ.9 కోట్లు ఆదా అయ్యాయని అధికారులు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల పుస్తకాల కోసం త్వరలో టెండర్లు ఖరారు చేసి ఏప్రిల్ నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ సారి ప్రత్యేకతలు