వికారాబాద్ అనంతగిరి వద్ద జరిగిన ఘటనపై డీజీపీ మహేందర్రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. డ్రగ్స్ మత్తులో ఉన్న యువకులు కారుతో ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఎస్సై కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనంతగిరి ఘటనపై స్పందించిన డీజీపీ మహేందర్రెడ్డి... - DGP MAHENDHER REDDY RESPONDED ON ANANTHAGIRI ACCIDENT
డ్రగ్స్ మత్తులో కారుతో యువకులు బీభత్సం సృష్టించిన ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవాబ్పేట ఎస్సై కృష్ణ తొందరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు.
![అనంతగిరి ఘటనపై స్పందించిన డీజీపీ మహేందర్రెడ్డి... DGP MAHENDHER REDDY RESPONDED ON ANANTHAGIRI ACCIDENT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5567512-thumbnail-3x2-pp.jpg)
అనంతగిరి ఘటనపై స్పందించిన డీజీపీ మహేందర్రెడ్డి...
ఎన్ని అవరోధాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో విధులు నిర్వహిస్తున్నారని డీజీపీ తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సేవలను అభినందిస్తున్నానని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.
ఇవీ చూడండి: డ్రగ్స్ మత్తులో కారుతో యువకుల హల్చల్... ఎస్సైకి తీవ్ర గాయాలు