తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులపై కీరవాణి పాట.. ఆవిష్కరించిన డీజీపీ - mm keeravani sang a song on police

విధి నిర్వహణలో పోలీసుల సేవలను వివరిస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచిన పాటను డీజీపీ మహేందర్​ రెడ్డి.. ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కర్తవ్యాన్ని నిర్వర్తించే పోలీసుల గురించి పాటలో స్ఫూర్తిదాయకంగా తెలిపిన కీరవాణిని కొనియాడారు. రక్షక దేవోభవ అని ప్రజలు అనుకునే రోజులు వస్తాయని కీరవాణి అన్నారు.

dgp mahender reddy released the police song sung by keeravani
పోలీసులపై కీరవాణి పాట.. ఆవిష్కరించిన డీజీపీ

By

Published : Oct 31, 2020, 8:05 PM IST

మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ మాదిరిగా రక్షక దేవోభవ అనే రోజులు వస్తాయని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అన్నారు. పోలీసులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. విధి నిర్వహణలో పోలీసుల కర్తవ్యాలను, వారి ఇబ్బందులను వివరిస్తూ కీరవాణి స్వరపరిచిన పాటను డీజీపీ మహేందర్​ రెడ్డి.. ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీ రామ్ పాటను రచించారు.

తన తొమ్మిదేళ్ల వయస్సులో తొలి కార్యక్రమం రాయచూరులో పోలీసు సంస్మరణ దినోత్సవం రోజునే ఇచ్చానని కీరవాణి గుర్తు చేసుకున్నారు. 'ఇస్తున్నా ప్రాణం మీ కోసం' అనే పాటను 1998 సంవత్సరంలోనే అప్పటి డీజీపీల కోరిక మేరకు స్వర పరిచి పాడానని తెలిపారు.

విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులను వివరిస్తూనే తాము అందించే సేవలను పాటలో స్ఫూర్తి దాయకంగా పొందుపర్చారని కీరవాణిని డీజీపీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:వరద సాయం కోసం ఉప్పల్​లో బాధితుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details