తెలంగాణ

telangana

ETV Bharat / state

మల్కాజిగిరి ఏసీపీపై వేటు... ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహరెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్​ చేస్తూ డీజీపీ మహేందర్​ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అతని స్థానంలోకి మాదాపూర్​ ఏసీపీని నియమించగా.. మాదాపూర్​లో ఇంటెలిజెన్స్​ డీఎస్పీను నియమించారు.

By

Published : Sep 24, 2020, 11:06 PM IST

dgp mahendar passed orders attaching malkajgiri acp  to dgp office
మల్కాజిగిరి ఏసీపీపై వేటు... ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహ రెడ్డిపై వేటు పడింది. అతన్ని తన కార్యాలయానికి అటాచ్​ చేస్తూ డీజీపీ మహేందర్​రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అతని స్థానంలో మాదాపూర్​ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న శ్యాంప్రసాద్​రావును నియమించారు.

ఏసీపీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ మహేందర్​రెడ్డి

మాదాపూర్​ ఏసీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్​లో డీఎస్పీగా పనిచేస్తున్న రఘనందన్​రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇలా ఉంటే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన నర్సింహారెడ్డిని సస్పెండ్​ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి :హైదరాబాద్‌లో రేపటి నుంచి సిటీ బస్సులు

ABOUT THE AUTHOR

...view details