Rush at Temples On New Year : ఆంగ్ల నూతన సంవత్సరాదిన.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు - birla temple rush
Rush at Temples On New Year : ఆంగ్ల నూతన సంవత్సరం వేళ రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో ఆశయాలు నెరవేరాలనీ వేడుకున్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో వేకువజాము నుంచే రద్దీ నెలకొంది.
భక్తులతో పోటెత్తిన ఆలయాలు
By
Published : Jan 2, 2022, 8:56 AM IST
Rush at Temples On New Year : ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయాలను దర్శించుకున్న భక్తులు కొత్త సంవత్సరంలో అవరోధాలు తొలగాలనీ, ఆశయాలు నెరవేరాలనీ వేడుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. కోరికలు నెరవేర్చాలంటూ భక్తులు కట్టిన కాశీ తాళ్లతో ఆలయ ఆవరణలోని రావి చెట్టు నిండిపోయింది.
హైదరాబాద్ బిర్లా మందిర్లోని వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు శనివారం వేకువజాము నుంచే బారులు తీరారు.
Heavy Rush at Yadadri Temple: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు రెండుమూడు గంటల సమయం పడుతోంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు స్వామివారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. సుప్రభాత సేవతో స్వామివారికి పూజలు ప్రారంభించారు. భక్తుల కోసం ప్రత్యేకంగా కొండపైన సువర్ణ పుష్పార్చన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. లడ్డూ ప్రసాదాలు 69 వేలు తయారుచేశామని ఆలయ కార్యనిర్వాహక అధికారి గీతారెడ్డి తెలిపారు. ప్రసాదాల విక్రయాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగిస్తామని చెప్పారు.