తెలంగాణ

telangana

ETV Bharat / state

Ganesh Immersion: నిమజ్జనోత్సవంలో భక్తుల కోలాహలం.. ఏకరూప దుస్తుల్లో సందడి - devotees came in dress code at ganesh immersion

హైదరాబాద్ నగరంలో గణేశుని శోభాయాత్ర కన్నులపండువగా సాగుతోంది. విభిన్న రూపాల్లో గణనాథుడు భాగ్యనగర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నాడు. నిమజ్జనం జరిగే చెరువుల వద్దకు వందల సంఖ్యలో గణేశుని విగ్రహాలు చేరుతున్నాయి. శోభాయాత్రలో కొందరు ఏకరూప దుస్తుల్లో తయారై వారి వారి గణనాథులను నిమజ్జనానికి తీసుకువచ్చారు.

devotees came in dress code  at ganesh immersion
నిమజ్జనోత్సవంలో భక్తుల కోలాహలం

By

Published : Sep 19, 2021, 7:50 PM IST

హైదరాబాద్​ సరూర్​ నగర్​ చెరువు వద్ద గణేశ్​ నిమజ్జనంలో ఓ మండప నిర్వాహకులు ఏకరూప దుస్తులు ధరించి శోభా యాత్రలో భక్తులను ఆకట్టుకున్నారు. ఎరుపు, పసుపు, నీలం, కాషాయ, తెలుపు రంగుల్లోని కుర్తాలు ధరించి సందడి చేశారు. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఏకరూప దుస్తులు ధరించి మరింత శోభ తీసుకువచ్చారు. కొందరు తలకు పగిడీలు ధరించి చూడముచ్చటగా కనిపించారు.

ఒకే రకమైన దుస్తుల్లో కుటుబం సభ్యులు

మండప నిర్వాహకులు మాత్రమే కాదు శోభాయాత్రను తిలకించేందుకు వచ్చిన భక్తులు కూడా ఏకరూప దుస్తులు ధరించి రావడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ కుటుంబానికి చెందిన సభ్యులందరూ ఏకరూప దుస్తులు ధరించి నిమజ్జనంలో ప్రత్యేక ఆర్షణగా నిలిచారు.

ఏకరూప దుస్తుల్లో గణేశ్​ నిమజ్జనంలో భక్తులు

ఇదీ చదవండి:Laddu: గచ్చిబౌలి గణేశ్ లడ్డూకి రికార్డు రేట్... ఎన్ని లక్షలంటే?

ABOUT THE AUTHOR

...view details