పరిసరాల పరిశుభ్రతలో జీహెచ్ఎంసీ చేస్తున్న కృషికి ప్రజలు కూడా సహకరించాలని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా కొత్తగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి సమకూరిన 6 శానిటేషన్ ఆటోలను ఆయన సీతాఫల్మండి ముల్టీపర్పస్ హాల్ వద్ద ప్రారంభించారు.
'జీహెచ్ఎంసీ కృషికి ప్రజలు కూడా సహకరించాలి' - Deputy Speaker launched Sanitation Vehicles
జీహెచ్ఎంసీ ద్వారా కొత్తగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి సమకూరిన 6 శానిటేషన్ ఆటోలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సీతాఫల్మండి ముల్టీపర్పస్ హాల్ వద్ద ప్రారంభించారు.
!['జీహెచ్ఎంసీ కృషికి ప్రజలు కూడా సహకరించాలి' Sanitation Vehicles](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11212860-1107-11212860-1617100447728.jpg)
శానిటేషన్ ఆటోలు
డిప్యూటీ స్పీకర్ పద్మారావు కాసేపు శానిటేషన్ వాహనాన్ని నడిపారు. సికింద్రాబాద్లోని అన్ని కాలనీలు, బస్తీలను పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన పక్షంలో అదనంగా సిబ్బందిని, వనరులను సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఉప కమిషనర్ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.