ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా... సికింద్రాబాద్ లాలాపేట్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఉపసభాపతి పద్మారావు గౌడ్ మొక్కలు నాటారు. జంటనగరాల్లో రెండున్నర కోట్ల మొక్కలు నాటటమే లక్ష్యంగా నిర్ధారించుకున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు.
'జంటనగరాల్లో రెండున్నర కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం' - haritha haaram program in secundrabad
సికింద్రాబాద్ లాలాపేట్లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఉపసభాపతి పద్మారావు గౌడ్ మొక్కలు నాటారు. ఆరో విడత హరితహారంలో భాగంగా జంటనగరాల్లో రెండున్నర కోట్ల మొక్కలు నాటాడమే లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
!['జంటనగరాల్లో రెండున్నర కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం' deputy speaker padmarao goud participated in haritha haaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7766733-539-7766733-1593085504196.jpg)
deputy speaker padmarao goud participated in haritha haaram
ప్రకృతిని పరిరక్షించుకోకపోతే అనర్థాలు తప్పవని హెచ్చరించారు. లాలాపేట్లోని స్టేడియంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించేందుకు రూ. 6 కోట్లతో స్విమ్మింగ్ ఫూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆధునిక హంగులతో ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని పద్మారావు గౌడ్ హామీ ఇచ్చారు.