తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీ దవాఖానాను ప్రారంభించిన పద్మారావు గౌడ్​ - గ్రేటర్​ పరిధిలో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో మరో 45 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్​ నాంపల్లి నియోజకవర్గంలోని శ్రీరామ్​నగర్​, బోజగుట్టలో నూతనంగా నిర్మించిన బస్తీదవాఖానాను రాష్ట్ర డిప్యూటీ స్పీకర్​ పద్మారావు గౌడ్​ ప్రారంభించారు.

padmarao goud inaugurated of basti dawakhana
బస్తీ దవాఖానాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్​

By

Published : May 22, 2020, 2:15 PM IST

రాష్ట్రంలో బస్తీ వాసులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచిందని డిప్యూటీ స్పీకర్​ పద్మారావు గౌడ్​ పేర్కొన్నారు. హైదరాబాద్​ నాంపల్లి నియోజకవర్గంలోని శ్రీరామ్​నగర్​, బోజగుట్టలో నూతనంగా నిర్మించిన బస్తీదవాఖానాను ఆయన​ ప్రారంభించారు.

కరోనా వ్యాప్తి కారణంగా ఆస్పత్రికి వచ్చే వారంతా భౌతిక దూరం పాటించాలని పద్మారావుగౌడ్​ సూచించారు. ఆస్పత్రిలో రోగుల కోసం ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్​ మెరాజ్​ హుస్సేన్​, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:గ్రేటర్​లో మరో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details