వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారుతున్న నేపథ్యంలో పేదలకు బస్తీ దవాఖానాల ఏర్పాటు వల్ల మేలు చేకూరుతుందని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్లోని అంబానగర్ కాలనీలో, సీతాఫల్మండీ డివిజన్లోని ఇందిరానగర్ కాలనీలో రెండు బస్తీ దవాఖానాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 200 బస్తీ దవాఖానాలు ఉన్నాయని.. వాటి ద్వారా ప్రతిరోజు 20 వేల మందికి వైద్య సేవలు అందుతున్నాయన్నారు.
ప్రతి బస్తీ దవాఖానాలో ఓ వైద్యుడు, నర్సు, సహాయకుడు ఉంటారని తెలిపారు. వివిధ పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తారని వెల్లడించారు. సికింద్రాబాద్ పరిధిలో ఇప్పటికే రవీంద్రనగర్ , చింత బావి, లంబాడీ బస్తీ ప్రాంతాల్లో ఇప్పటికే మూడు బస్తీ దవాఖనాలు నెలకొల్పామన్నారు. త్వరలో ఆర్య నగర్, వినోభా నగర్, అడ్డగుట్ట ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీమతి ధనంజన బాయిగౌడ్, కుమారి సామల హేమ, తెరాస నేతలు కిషోర్ కుమార్ గౌడ్, తీగుల్ల రామేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
బస్తీ దవాఖానాలను ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావుగౌడ్ - hyderabad news
సికింద్రాబాద్ నియోజవర్గంలోని బౌద్దనగర్, సీతాఫల్మండీ డివిజన్లలోని పలు కాలనీల్లో ఉపసభాపతి పద్మారావు గౌడ్ బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. వైద్య ఖరీదైన వ్యవహారంగా మారుతున్న నేపథ్యంలో పేదలకు బస్తీ దవాఖానాలు ఎంతగానో ఉపయోగపడుతున్నారు.
![బస్తీ దవాఖానాలను ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావుగౌడ్ deputy speaker padmarao goud inaugurated basti hospitals in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9526771-905-9526771-1605193284498.jpg)
బస్తీ దవాఖానాలను ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావుగౌడ్
ఇవీ చూడండి: రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం