తెలంగాణ

telangana

By

Published : Jul 24, 2020, 10:51 PM IST

ETV Bharat / state

గిఫ్ట్‌ ఏ స్మైల్‌: దివ్యాంగుడికి వీల్‌ చైర్‌ అందజేత

మంత్రి కేటీఆర్‌ గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా ఓ దివ్యాంగుడికి డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ వీల్‌ చైర్‌ అందజేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.

గిఫ్ట్‌ ఏ స్మైల్‌: దివ్యాంగుడికి వీల్‌ చైర్‌ అందజేత
గిఫ్ట్‌ ఏ స్మైల్‌: దివ్యాంగుడికి వీల్‌ చైర్‌ అందజేత

తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా శుక్రవారం డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ళ పద్మారావు గౌడ్ సికింద్రాబాద్‌ మెట్టుగూడకి చెందిన నిశాంత్ అనే దివ్యాంగుడికి ఎలక్ట్రికల్ వీల్ చైర్‌ని అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పథకాల ద్వారా ఎంతో మంది లబ్దిదారులకు సహాయం అందిందని పద్మారావు గౌడ్‌ పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని.. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలని అధిరోహించాలని పద్మారావు గౌడ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు తీగుళ్ళ రామేశ్వర్ గౌడ్, తీగుళ్ల కిశోర్ గౌడ్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి:కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details