కొత్త సచివాలయ భవన నిర్మాణానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత భవనాల కూల్చివేత ప్రక్రియ చేపట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రక్రియ ప్రారంభంకాగా... ప్రొక్లెయిన్లు, జేసీబీల సహాయంతో భవనాలను నేలమట్టం చేస్తున్నారు. కూల్చివేతకు వివిధ రకాల పద్దతులు ఉన్నా... పక్కనే తెలుగుతల్లి పై వంతెన, మింట్కాంపౌండ్ సహా హోంసైన్స్ కళాశాల వంటి పురాతనభవనాలు, హుస్సేన్సాగర్ జలాశయం ఉన్నందున కేవలం యంత్రాల సాయంతో భవనాలు కూల్చేవేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టంచేశారు.
నేలమట్టం..
సచివాలయ ప్రాంగణంలోని పురాతన, చారిత్రక కట్టడమైన జీ-బ్లాక్ సర్వహితను తొలుత నేలమట్టం చేశారు. సచివాలయ ప్రవేశద్వారం పక్కనే ఉన్న విద్యుత్ శాఖకు చెందిన రాతికట్టడాన్ని... సీఎం కార్యాలయం ఉండే సీ- బ్లాక్ సమత భవనాన్ని ఓ వైపు కూల్చేశారు. మిగిలివాటిని తొలగించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రాత్రి సమయంలోనూ భవనాలను నేలమట్టం చేసే ప్రక్రియ కొనసాగింది.
మొత్తం 10 బ్లాకులు..