తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లా అధ్యక్షులపై కుంతియా ఆగ్రహం

నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్​ఛార్జి కుంతియా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణయించిన సమయానికి హాజరు కాలేదని ఆగ్రహించారు. గైర్హాజరైన వారిని వివరణ కోరాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు.

By

Published : Feb 12, 2019, 4:39 AM IST

Updated : Feb 12, 2019, 10:54 AM IST

కుంతియా

కుంతియా ఆగ్రహం
లోక‌స‌భ ఎన్నిక‌ల దృష్ట్యా గాంధీభ‌వ‌న్‌లో నిర్వహించిన‌ జిల్లా కాంగ్రెస్ క‌మిటీ అధ్యక్షుల స‌మావేశం వాడివేడిగా సాగింది. మొట్టమొద‌టి స‌మావేశానికి ఆల‌స్యంగా వ‌చ్చిన డీసీసీ అధ్యక్షుల‌పై రాష్ట్ర వ్యవ‌హారాల ఇన్​ఛార్జి ఆర్​సీ కుంతియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన నలుగురిని వివ‌ర‌ణ కోరాల‌ని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు.

సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి అధిష్ఠానం ఇటీవల కొత్త డీసీసీల‌ను ఏర్పాటు చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యద‌ర్శి కేసీ వేణుగోపాల్ జిల్లా, న‌గ‌ర అధ్యక్షుల‌ను ప్రకటించారు. నూతన అధ్యక్షులతో సోమవారం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్​లో సమావేశం ఏర్పాటు చేశారు. నలుగురు మాత్రమే హాజరు కావడంతో 12.30కు సమావేశం ప్రారంభమైంది. నిర్దేశించిన సమయానికి రాలేదని కుంతియా అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక‌స‌భ ఎన్నిక‌లు పూర్తయ్యే వ‌ర‌కు డీసీసీలు పూర్తి స్థాయిలో ప‌ని చేయాల‌ని... ఎవ‌రూ తేలిక‌గా తీసుకోవ‌ద్దని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల‌ను రానున్న లోక‌స‌భ ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేయాల‌ని సూచించారు.

Last Updated : Feb 12, 2019, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details