తెలంగాణ

telangana

By

Published : Jan 6, 2021, 5:25 PM IST

ETV Bharat / state

సామాజిక బాధ్యతలో సైకిల్​ అగరుబత్తి సిబ్బంది

కరోనా సంక్షోభ సమయంలో ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా శానిటైజర్​ వాడాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సైకిల్​ అగరుబత్తి తెలంగాణ మేనేజర్​ ఆధ్వర్యంలో కరోనా వారియర్స్​కు శానిటైజర్​ పంపిణీ చేయడాన్ని ఆయన ప్రశంసించారు.

cycle agarbatti employees distribute sanitizers to corona warriors in hyderabad
సామాజిక బాధ్యతలో సైకిల్​ అగరుబత్తి సిబ్బంది

దేశ వ్యాప్తంగా మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న కొవిడ్​ వారియర్స్​కు సైకిల్​ అగరుబత్తి సంస్థ సిబ్బంది శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో సుమారు ఐదు వేల శానిటైజర్లను ఆ సంస్థ తెలంగాణ ఏరియా మేనేజర్​ హైదరాబాద్​ జిల్లా వైద్యాధికారికి అందజేశారు.

కరోనా వారియర్స్​కు తమ వంతు బాధ్యతగా శానిటైజర్లను పంపిణీ చేసిన సైకిల్​ అగరుబత్తి సంస్థ సిబ్బందిని మంత్రి శ్రీనివాస్​ యాదవ్​ అభినందించారు.

ఇదీ చదవండి:ఫిబ్రవరి నెలలో బడ్జెట్ సమావేశాలు..!

ABOUT THE AUTHOR

...view details