తెలంగాణ

telangana

By

Published : Jun 11, 2021, 4:09 AM IST

ETV Bharat / state

VIRAL: ట్రిపుల్​ రైడింగ్ చేశారు.. రూ.3,600 కట్టారు..!

'రోడ్డుపై టైటానిక్​ విన్యాసాలు.. పట్టుతప్పితే మునిగిపోతాయి ప్రాణాలు' అంటూ సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్​లో పోస్ట్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. అసలు ఆ ఫొటోలో ఏముందంటే..?

ట్రిపుల్​ రైడింగ్ చేశారు.. రూ.3,600 కట్టారు..!
ట్రిపుల్​ రైడింగ్ చేశారు.. రూ.3,600 కట్టారు..!

ఓ ద్విచక్ర వాహనదారుడికి సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు షాక్​ ఇచ్చారు. బైక్​పై ముగ్గురు ప్రయాణించినందుకు గానూ ఏకకాలంలో రూ.3600 జరిమానా విధించారు. అదెలా అంటే..

  • బైక్​పై వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్​ ధరించనందుకు రూ.100
  • సెల్​ఫోన్​ చూస్తూ డ్రైవింగ్​ చేసినందుకు రూ.1,000
  • బహిరంగ ప్రదేశాల్లో మాస్కు సరిగా ధరించనందుకు రూ.1,000
  • డ్రైవర్ హెల్మెట్ ధరించనందుకు రూ.200
  • సైడ్​ మిర్రర్స్​ లేనందుకు రూ.100
  • ట్రిపుల్​ రైడింగ్​కు రూ.1,200

ఇలా మొత్తం చలానా విలువ రూ.3,600 చేరింది. ఈ ఫొటోను పోలీసులు తమ ట్విట్టర్​లో పోస్టు చేయగా.. ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి:CCMB: కరోనా రాకుండా మాస్కు ఎలా ధరించాలో తెలుసా!

ABOUT THE AUTHOR

...view details