తెలంగాణ

telangana

సైబరాబాద్​ సెక్యూరిటీ కౌన్సిల్​కు సీపీ సజ్జనార్​ అభినందన

By

Published : May 15, 2021, 10:09 AM IST

ప్రభుత్వాసుపత్రులకు మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్​ చేపట్టింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాలను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ జెండా ఊపి ప్రారంభించారు.

sajjanar
sajjanar

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోని ప్రభుత్వ ఆసుపత్రులకు మాస్కులు, శానిటైజర్లు, పల్స్‌ ఆక్సిమీటర్లు, ఇతరత్రా అవసరమైన పరికరాలు అందజేసేందుకు సైబరాబాద్‌ సెక్యురిటీ కౌన్సిల్ ముందుకు వచ్చింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాలను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ జెండా ఊపి ప్రారంభించారు. పలు ఐటీ సంస్థలతో కలిసి సెక్యురిటీ కౌన్సిల్‌ చేపడుతున్న కార్యక్రమాన్ని సజ్జనార్‌ అభినందించారు.

ఇదీ చూడండి:'త్వరగా రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు సర్కారు కృషి'

ABOUT THE AUTHOR

...view details