తెలంగాణ

telangana

ETV Bharat / state

సైబరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక: తగ్గిన నేరాలు.. పెరిగిన శిక్షలు - Cyberabad CP Stephen Ravindra Latest News

సైబరాబాద్ కమిషనరేట్​ పరిధిలో నేరాల వార్షిక నివేదికను సీపీ స్టీఫెన్ రవీంద్ర​ విడుదల చేశారు. ఈ సంవత్సరం 27,322 ఎఫ్ఐఆర్​లు నమోదు చేశామని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల కేసులు 19.8 శాతం తగ్గాయని ఆయన వివరించారు.

Stephen Ravindra
Stephen Ravindra

By

Published : Dec 23, 2022, 4:27 PM IST

సైబరాబాద్ కమిషనరేట్​ పరిధిలో వార్షిక నేర నివేదికను సీపీ స్టీఫెన్ రవీంద్ర విడుదల చేశారు. ఈ సంవత్సరం 27,322 ఎఫ్ఐఆర్​లు నమోదు చేశామని తెలిపారు. 79 మందిపై పీడీ యాక్ట్​లు పెట్టామని చెప్పారు. 57,175 డ్రంకన్ డ్రైవింగ్ కేసులు.. 13 మందిపై రౌడీషీట్​లు తెరిచామని పేర్కొన్నారు. 849 మందిపై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశామని వివరించారు. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల కేసులు 19.8 శాతం తగ్గాయని వెల్లడించారు.

అపహరణ కేసులు 2021లో 244 కేసులు ఉండగా.. 2022లో 232 కేసులు నమోదు చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మహిళా హత్యలు, స్థిరాస్తి నేరాల హత్యలు ఈ సంవత్సరం తగ్గాయని పేర్కొన్నారు. దోపిడీ కేసులు 99 శాతం తగ్గాయని.. స్నాచింగ్ కేసులు 4 శాతం తగ్గాయని చెప్పారు. రాత్రి దొంగతనాల కేసులు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 33 శాతం తగ్గాయని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.

సైబర్ నేరాలు పెరిగాయని 2021లో 3,854 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాదిలో 4,850 కేసులు నమోదయ్యాయని చెప్పారు. సైబర్ నేరాల కట్టడికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గతేడాది 6,474 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని.. ఈ సంవత్సరం 1,788 కిలోల గంజాయి మాత్రమే పట్టుబడిందని వివరించారు. మాదక ద్రవ్యాలను ఈ ఏడాది పూర్తి స్థాయిలో నియంత్రించామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

ఇవీ చదవండి:ఎంపీల అభ్యర్థనకు రాజ్యసభ ఛైర్మన్‌ ఓకే.. పార్లమెంటులోనూ ఇకపై బీఆర్‌ఎస్‌..!

ఫ్లైట్​ క్యాన్సిల్​ అయితే రూ.10వేలు పరిహారం.. బోర్డింగ్​కు నిరాకరిస్తే రూ.20వేలు!

ABOUT THE AUTHOR

...view details