తెలంగాణ

telangana

ETV Bharat / state

అంగట్లో సరుకులా పౌరుల వ్యక్తిగత డేటా.. అమ్ముకున్నోడికి అమ్ముకున్నంత..! - which software use in information theft

police arrested suspect in data theft case : అంగట్లో సరుకులా ఏకంగా 66.9 కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటా విక్రయిస్తున్న మరో నేరగాడు సైబరాబాద్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. 16.8 కోట్ల మంది డేటా చోరీ ఘటన మరువక ముందే.. 66.9 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం చౌర్యం చేసి అంతర్జాలంలో విక్రయానికి పెట్టిన ఘరానా నేరగాడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. 24 రాష్ట్రాలు, 8 మెట్రో నగరాలకు చెందిన పౌరుల డేటా నిందితుడి వద్ద లభించింది. విలువైన వ్యక్తిగత సమాచారాన్ని 104 కేటగిరీలుగా విభజించి విక్రయిస్తున్నారు.

Vinay Bharadwaj is selling personal data of 66.9 crore citizens
66.9 కోట్ల మంది పౌరుల డేటా చోరీ

By

Published : Apr 2, 2023, 10:27 AM IST

police arrested suspect in data theft case : ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నేరగాళ్లు పౌరుల వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. 16.8 కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటా చోరీ కేసు మరువకముందే తాజాగా మరో సంచలన కేసు బయటపడింది. ఏకంగా 66.9 కోట్ల మందికి చెందిన డేటాను దిల్లీకి చెందిన వినయ్‌ భరద్వాజ్‌ దర్జాగా విక్రయిస్తున్నాడు. అమర్‌ సోహైల్‌, మదన్‌ గోపాల్‌ నుంచి డేటా కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో సైబర్‌ నేరగాళ్లతో పాటు ఇతర వ్యాపార ప్రకటనలు అవసరమున్న వారికి అమ్ముతున్నాడు. ఫరీదాబాద్‌ కేంద్రంగా 8 నెలలుగా ఈ దందా సాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు చెందిన రహస్య, సున్నిత సమాచారం ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

చోరీ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌: దేశవ్యాప్తంగా జీఎస్టీ చెల్లింపులు, ఆర్టీవోలో నమోదైన వ్యక్తులు, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, బిగ్‌ బాస్కెట్‌, ఇన్‌స్టాగ్రామ్‌, జొమాటో, పాలసీ బజార్‌ వినియోగదారుల వివరాలు లభించాయి. హర్యానాలో ఫరీదాబాద్‌ కేంద్రంగా క్లౌడ్‌ డ్రైవ్‌ లింకుల ద్వారా సమాచారం విక్రయిస్తున్నాడు. డేటా విక్రయించేందుకు ఇన్‌స్పైర్‌ వెబ్స్‌ పేరుతో వెబ్‌సైట్ సృష్టించాడు. సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్‌ ప్రచారం చేస్తున్నాడు. ఏ రాష్ట్రంలో ఏ విభాగం ప్రజల డేటా అవసరమో తెలుసుకుని దాని ధర నిర్ణయించి విక్రయిస్తున్నాడు.

హైదరాబాద్‌కు చెందిన 55 లక్షల మంది డేటా చోరీ: త్వరగా డౌన్‌లోడ్‌ కావాలంటే తాను పంపే సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అదనంగా సొమ్ము వసూలు చేస్తున్నాడు. నిందితుడి వద్ద తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండున్నర కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటా లభ్యమైంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2 కోట్ల పది లక్షల మంది, హైదరాబాద్‌కు చెందిన 55 లక్షల మంది డేటా నిందితుడి వద్ద పోలీసులు కనుగొన్నారు. యూపీకి చెందిన 21 కోట్ల మంది, నాలుగున్నర కోట్ల మహారాష్ట్ర వాసుల సమాచారం వినయ్‌ భరద్వాజ వద్ద లభించింది.

ప్రత్యేక కాల్ సెంటర్‌ ఏర్పాటు:నిందితుడు ఇన్‌స్పైర్‌ వెబ్‌సైట్‌ ద్వారా పది వేల మంది ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల డేటాను రెండున్నర వేలకు, 50 వేల మంది ఫేస్‌బుక్‌ ఫాలోవర్ల డేటాను రూ.15 వేలకు విక్రయించాడు. డబ్బు చెల్లించగానే డేటా వచ్చేలా పకడ్బందీ వ్యవస్థ రూపొందించాడు. సమస్యలుంటే సంప్రదించేందుకు ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాడు. వివరాలు బయటపడకుండా వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నాడు. ప్రచారం కోసం సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ఏర్పాటు చేసుకున్నాడు.

నిందితుడి దగ్గర ఎలాంటి సమాచారం ఉంది: పేరు, మొబైల్‌ నెంబర్‌, పిన్‌కోడ్‌, నగరం, ఈ మెయిల్‌ ఐడీ, చిరునామా, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వృత్తి, పేటీఎం ఖాతాదారుల వివరాలు, జీఎస్టీ కట్టే వ్యక్తుల వార్షికాదాయం, వాహనదారుల డేటా వంటివి నిందితుడి వద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డేటా లీక్ కావడానికి వాటిని సేకరించే సంస్థల వైఫల్యమే కారణమని.. వారికి నోటీసులిచ్చేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో.. ఈ కేసులో మరిన్ని సెక్షన్‌లు నమోదు చేసే అవకాశం ఉంది. వ్యక్తిగత సమాచారం చౌర్యం కేసును తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నారు.

66.9 కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటా విక్రయిస్తున్న వినయ్‌ భరద్వాజ్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details