తెలంగాణ

telangana

ETV Bharat / state

గూగుల్​ సాయంతో సైబర్ నేరాలకు చెక్..! - Cyber criminals using google as a platform

సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు కొత్త వ్యూహం పన్నారు. గూగుల్ వేదికగా జరుగుతున్న మోసాలను ఆ సంస్థ దృష్టికి తీసుకొచ్చారు. ఇకనుంచి గూగుల్ సాయంతో జరిగే సైబర్ నేరాల దర్యాప్తుతో సహకారం అందించేందుకు ఆ సంస్థ అంగీకరించింది.

'గూగుల్​ను వేదికగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు'
'గూగుల్​ వేదికగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు'

By

Published : Sep 24, 2020, 9:27 PM IST

గూగుల్​ను వేదికగా చేసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని... సైబరాబాద్ సీపీ సజ్జనార్ గూగుల్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. గూగుల్​లో నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా అమాయకులను నమ్మంచి డబ్బులు లాగేస్తున్నారని... సజ్జనార్ తెలిపారు. అంతేకాకుండా ఇతర మార్గాల్లోనూ... మోసాలు చేయడానికి సైబర్ నేరగాళ్లు గూగుల్​ను ఎంచుకుంటున్నారని సీపీ అన్నారు.

ఈ విషయాలను గూగుల్ ప్రతినిధులు గీతాంజలి, సునీతా మెంహతీ దృష్టికి తీసుకెళ్లారు. సైబరాబాద్​కు చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి... గూగుల్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ తరహా సైబర్ నేరాలను నిరోధించడానికి తమ సాంకేతిక సిబ్బంది పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని... గూగుల్ ప్రతినిధి గీతాంజలి తెలిపారు.

సైబర్ నేరాల దర్యాప్తులో భాగంగా గూగుల్ నుంచి కావాల్సిన సమాచారం ఇవ్వడానికి సిద్ధమని ఆమె తెలిపారు. సమావేశంలో సైబర్ నేరాలను నిరోధించడానికి గూగుల్ ప్రతినిధులు- సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి: ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిపై కమల్​హాసన్

ABOUT THE AUTHOR

...view details