సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. నానాటికీ అవి పెరుగుతూనే ఉన్నాయి. మోసపోతున్న వారిలో చదువుకున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా తక్కువ ధరకే ల్యాప్టాప్లంటూ ఓఎల్ఎక్స్లో వచ్చిన ప్రకటనకు స్పందించిన ఇద్దరు విద్యార్థులు సైబర్నేరగాళ్లకు చిక్కారు. ఆన్లైన్ మోసగాళ్లు ఇచ్చిన క్యూఆర్కోడ్కు యువకులిద్దరూ రూ. 1.25 లక్షలు పంపించారు. అప్పట్నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వల్ల మోసపోయామని గ్రహించిన యువకులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ల్యాప్టాప్ పేరుతో రూ.1.25 లక్షలకు కుచ్చుటోపి - Hyderabad CCS
తక్కువ ధరకే ల్యాప్టాప్ అంటూ ఓఎల్ఎక్స్లో ప్రకటనలిచ్చి ఇద్దరు యువకులకు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. వారి వద్ద నుంచి రూ. 1.25 లక్షలు వసూలు చేశారు. ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది.
![ల్యాప్టాప్ పేరుతో రూ.1.25 లక్షలకు కుచ్చుటోపి ల్యాప్టాప్ పేరుతో రూ.1.25 లక్షలకు కుచ్చుటోపి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6691481-83-6691481-1586204276460.jpg)
ల్యాప్టాప్ పేరుతో రూ.1.25 లక్షలకు కుచ్చుటోపి