తెలంగాణ

telangana

By

Published : Dec 22, 2019, 1:30 PM IST

Updated : Dec 22, 2019, 3:02 PM IST

ETV Bharat / state

మొక్కల పెంపకం ఉద్యమంలా సాగాలి: మిథాలీ

మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని  భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అన్నారు. తూర్పు మండలం డీసీపీ ఎం.రమేశ్  నుంచి గ్రీన్​ ఛాలెంజ్​ స్వీకరించిన ఆమె తన నివాసంలో మొక్కలు నాటారు.

cricketer mithaliraj takes green challenge
గ్రీన్​ ఛాలెంజ్​​ను స్వీకరించిన మిథాలీ

గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా తన నివాసం వద్ద భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ప్రతిఒక్కరూ ఉద్యమంలా చేపట్టి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. బీసీసీఐ ఛైర్మన్​ సౌరవ్​ గంగూలీ, సినీనటి కాజల్​ అగర్వాల్​, ప్రముఖ వెంచర్​ క్యాపటలిస్ట్​ వాణీ కోలా, ప్రముఖ క్రీడా పాత్రికేయుడు బొరియా మజుందర్​కు మిథాలీ గ్రీన్ ​సవాల్​ విసిరారు.

గ్రీన్​ ఛాలెంజ్​​ను స్వీకరించిన మిథాలీ
Last Updated : Dec 22, 2019, 3:02 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details