తెలంగాణ

telangana

'ధరల పెంపు.. పేదలపై మోయలేని భారం'

By

Published : Feb 15, 2021, 2:20 PM IST

ఇందన, గ్యాస్​ సిలిండర్​ ధరలను తగ్గించాలంటూ.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్​లో సీపీఎం ఆందోళన నిర్వహించింది. ధరల పెంపుతో.. సమాజంలో పేద ప్రజలకు జీవించలేని దుస్థితి ఏర్పడిందని సెంట్రల్ జోన్ కార్యదర్శి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

cpm protests at rtc cross Roads demands price reduction of Fuel and gas cylinder
'ధరల పెంపు.. పేదలపై మోయలేని భారం'

కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి.. పేద ప్రజల రక్తాన్ని పీలుస్తోందని హైదరాబాద్​లోని సీపీఎం నేతలు మండిపడ్డారు. ధరలను తగ్గించాలని డిమాండ్​ చేస్తూ.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్​లో ఆందోళన నిర్వహించారు.

భాజపా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్​పై రూ. 50 పెంచి, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం వేసిందని.. సీపీఎం సెంట్రల్ జోన్ కార్యదర్శి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని గుర్తు చేశారు. త్వరలోనే కేంద్రం.. ఇందన ధరలను లీటరకు రూ. 100, గ్యాస్ సిలిండర్​ను రూ. 1000కి పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతుండగా.. దేశంలో మాత్రం ఇంధన ధరలు ఏరోజుకారోజు పెరుగుతూనే ఉన్నాయని శ్రీనివాస్​ గుర్తు చేశారు. ధరలు తగ్గించే వరకు దశల వారీగా ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి:రేపటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ

ABOUT THE AUTHOR

...view details