నూతన వ్యవసాయ చట్టాలను అమలుచేయకుంటే సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ వంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థని భాజపా సంఘ్ పరివార్ వ్యవస్థగా మార్చిందని రాఘవులు ధ్వజమెత్తారు.
ఫెడరల్ వ్యవస్థని కాపాడడానికి ప్రాంతీయ పార్టీలు ముందుకు రావాలని సీపీఎం పిలుపునిస్తుందన్నారు. ఇందులో కేసీఆర్ పాత్రేంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలపై తెరాస ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. పంట కోనుగోలు చేసే వరకు సీపీఎం.. మిలిటెంట్ తరహా పోరాటం చేస్తుందన్నారు.