తెలంగాణ

telangana

'కొవిడ్​ రెండో దశ వ్యాప్తికి కేంద్రమే కారణం'

By

Published : Apr 27, 2021, 9:42 PM IST

దేశవ్యాప్తంగా కొవిడ్‌ మహామ్మారి విస్తరిస్తోందని... సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. వైరస్​ రెండో దశ వ్యాప్తికి కేంద్రమే కారణమని ఆరోపించారు.

CPM politburo member BV Raghavulu on covid
కొవిడ్​ వ్యాప్తి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్న బీవీ.రాఘవులు

దేశంలో కొవిడ్​ రెండో దశ వ్యాప్తికి కేంద్ర ప్రభుత్వమే కారణమని... సీపీఎం పొలిట్​ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు ఆరోపించారు. 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణలో భాగంగా... భాజపా, కేంద్ర ఎన్నికల కమిషన్‌ వ్యవహరించిన తీరు కరోనా వ్యాప్తికి కారణమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా మహమ్మారి విస్తరిస్తోన్న నేపథ్యంలో... దాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం విఫలమైంది...

ప్రజలకు అవసరమైన ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఉచితంగా ప్రజలందరికీ టీకాలు ఇవ్వాల్సింది పోయి ధరలు నిర్ణయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా కొవిడ్‌ కోసం కేటాయించిన రూ.35 వేల కోట్లను, పీఎం కేర్‌ ఫండ్స్‌ కింద సేకరించిన వేల కోట్లను... కరోనాను అరికట్టేందుకు రాష్ర్ట ప్రభుత్వాలకు కేటాయించాలని రాఘవులు డిమాండ్‌ చేశారు.

సీఎం కేసీఆర్​కు లేఖ రాశాం...

కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాసినట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో వైరస్​ను అరికట్టేందుకు రాజకీయాలకు అతీతంగా యుద్ధం చేయాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో విస్తారంగా కరోనా పరీక్షలు పెంచడంతో పాటు ప్రతి గ్రామంలో వార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదన్న మంత్రి ఈటల రాజేందర్​

ABOUT THE AUTHOR

...view details