తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈఎస్​ఐ డైరెక్టరేట్​ వద్ద సీపీఎం ధర్నా - ఈఎస్​ఐసీ డైరెక్టరేట్​ వద్ద సీపీఎం నేతల ధర్నా

ఈఎస్​ఐ డైరెక్టరేట్​లో కుంభకోణాలు జరుగుతున్నాయని సీపీఎం నేతలు ఆరోపించారు. వందల కోట్ల కార్మికుల ధనాన్ని అధికారులు మందుల కంపెనీలతో కలిసి దోచుకుంటున్నారని... వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

సీపీఎం ధర్నా

By

Published : Jul 16, 2019, 3:10 PM IST

ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆ సంస్థ కార్యాలయం వద్ద సీపీఎం నేతలు ధర్నాకు దిగారు. వందల కోట్ల కార్మికుల సొమ్మును అధికారులు మందుల కంపెనీలతో కలిసి దోచుకుంటున్నారని సీపీఎం ఆరోపించింది. దీనిపై ఆరు నెలల క్రితమే నివేదిక ఇచ్చినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ఈఎస్​ఐ డైరెక్టరేట్​ వద్ద సీపీఎం ధర్నా

ABOUT THE AUTHOR

...view details