తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్థిక ప్యాకేజీతో ప్రజలను ఆదుకోవాలి: చాడ

కొవిడ్​-19 నేపథ్యంలో రాజధాని ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి.. ప్రజలను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

By

Published : Jul 2, 2020, 12:17 PM IST

cpi state secretery chada venkat reddy fires on govt
ఆర్థిక ప్యాకేజీతో ప్రజలను ఆదుకోవాలి: చాడ

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ప్రజలను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్​ చేశారు. కరోనా విజృంభణతో హైదరాబాద్​ ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారని తెలిపారు. రాజధానిలో కొవిడ్​ పరీక్షలను మరింత పెంచాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలు చెప్పినవన్నీ నిజమవుతున్నాయన్న చాడ.. గచ్చిబౌలి టిమ్స్‌ను ఎందుకు ఉపయోగించటం లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్​ చేశారు. బస్తీల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీచూడండి: దుర్గం చెరువుపై తుది ఘట్టానికి చేరిన కేబుల్ బ్రిడ్జి నిర్మాణం

ABOUT THE AUTHOR

...view details