తెలంగాణ

telangana

ETV Bharat / state

మరింత మమేకమై పనిచేయాలి: చాడ వెంకట్‌ రెడ్డి - ఏఐటీయూసీ శతజయంతి ఉత్సవాలు

ప్రధాని నరేంద్ర మోదీ అవలంభిస్తోన్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను ఎండగట్టేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా.. మరింత మమేకమై పనిచేయాలని ఏఐటీయూసీ శ్రేణులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా యావత్ కార్మికలోకానికి సీపీఐ తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

cpi state secretary chada venkat reddy wishes to labours on aituc hundred anniversary
మరింత మమేకమై పనిచేయాలి: చాడ వెంకట్‌ రెడ్డి

By

Published : Oct 30, 2020, 5:10 PM IST

ఏఐటీయూసీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా యావత్ కార్మికలోకానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అవలంభిస్తోన్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను ఎండగట్టేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా.. మరింత మమేకమై పనిచేయాలని ఏఐటీయూసీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

స్వాతంత్రం రాకముందు నుంచే కార్మికల హక్కుల కోసం ఏఐటీయూసీ పనిచేస్తోందని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లోని యాజమాన్యాల దురాఘాతాలను ఎండగట్టిందన్నారు.

ఇదీ చదవండి:భాగ్యనగరంలో విమాన సేవలు పుంజుకుంటున్నాయ్​..!

ABOUT THE AUTHOR

...view details