కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను సీపీఐ నేత రామకృష్ణ తప్పుబట్టారు. కర్నూలులో బోర్డు ఏర్పాటు చేస్తే రాయలసీమకు కూడా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
'కృష్ణా బోర్డు తరలింపుతో తెలంగాణకు లబ్ధి' - తెలంగాణ వార్తలు
కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కర్నూలులో పెట్టాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖకు తరలించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదన సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
'కృష్ణా బోర్డు తరలింపుతో తెలంగాణకు లబ్ధి'
కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కర్నూలు తరలించడం ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని రామకృష్ణ పేర్కొన్నారు.