రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి... యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా కేసులు తగ్గించేందుకు తీసుకునే చర్యలపై అఖిలపక్షంతో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కరోనాను గాలికి వదిలేస్తే ఇంకా కేసులు పెరిగి ప్రాణనష్టం అధికమవుతుందని చాడా పేర్కొన్నారు.
రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: చాడ వెంకట్రెడ్డి - chada ventak reddy about corona cases
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎవర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు చేసుకోకుండా... ప్రజలకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని చాడ సూచించారు.
రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: చాడ వెంకట్రెడ్డి
ప్రగతిభవన్లోనే 10 మందికి పాజిటివ్ రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంద్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ ఆగడం లేదని... మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కిలోల బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కిలోలు ఇవ్వడాన్ని స్వాగతిస్తామన్న చాడా... అలాగే ఆర్థిక సాయం కూడా అందించాలని కోరారు. కరోనా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు చేసుకోకుండా... ప్రజలకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని చాడ హితవు పలికారు.
ఇవీ చూడండి:వ్యవస్థీకృత జాడ్యాల వికృతరూపం!
Last Updated : Jul 5, 2020, 6:54 PM IST