CP CV Anand on Ganesh Immersion 2023 :హైదరాబాద్లో గణనాథులనిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతున్నాయని.. నగరంలో గణేశ్ నిమజ్జనాలు(Ganesh Nimajjanam) ముగింపు దశకు చేరుకున్నాయని సీపీ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) అన్నారు. ముఖ్యంగా భాగ్యనగరంలో నిమజ్జనంలో విధులను నిర్వహించిన పోలీస్ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నగర్ ప్రజలను నిమజ్జనానికి సహరించాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
Ganesh Idols Immersion in Hyderabad :ఈసారి భారీగా విగ్రహాలు ఏర్పాటు చేయడంతోనిమజ్జనాలు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. ఎప్పుడు లేని విధంగా ఖైరతాబాద్ గణేశ్ను(Khairatabad Ganesh Immersion) ముందుగా నిమజ్జనం చేశామని పేర్కొన్నారు.
Ganesh Idols Nimajjanam 2023 Hyderabad :ఈరోజు కూడా ఎక్కువ సంఖ్యలోగణేశ్ విగ్రహాలు(Ganesh Idols Nimajjanam) నిమజ్జనానికి వచ్చాయని సీపీ ఆనంద్ వెల్లడించారు. నెక్లెస్రోడ్డు వైపు ఉన్న విగ్రహలకు నిమజ్జనం జరుగుతున్నాయని తెలిపారు. మరో 450 విగ్రహాలు నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. జియో టాకింగ్ లెక్కల ప్రకారం.. భాగ్యనగరంలో 10,020 విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేశామన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 10 నుంచి 15% ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేశారని సీపీ చెప్పారు. మరోవైపు నిమజ్జనంలో 5 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. వారు బషీర్ బాగ్, సంజీవయ్య పార్క్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో మృతి చెందారని సీపీ ఆనంద్ వివరించారు.
Hyderabad Ganesh Nimajjanam Traffic : భాగ్యనగరంలో గణనాథుల నిమజ్జనం.. వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు..
Ganesh Shobha Yatra in Hyderabad : గణేశ్ నిమజ్జనం శోభాయాత్ర(Hyderabad Ganesh Nimajjanam Shobha Yatra) కోసం 48 గంటల పాటు ప్రభుత్వ అధికారులు విధుల్లో ఉన్నారని తెలియజేశారు. ఇవాళ హుస్సేన్సాగర్, ప్రసాద్ ఐమాక్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. పూర్తిగా నిమజ్జనం సాయంత్రం 5 గంటల సమయం పడుతుందని పేర్కోన్నారు.