తెలంగాణ

telangana

ETV Bharat / state

హజ్​యాత్రికుల బస్సును జెండా ఊపి ప్రారంభించిన సీపీ - cp

నగరం నుంచి హజ్​యాత్రకు వెళ్లే బస్సును హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.

హైదరాబాద్​లో హజ్​యాత్ర ప్రారంభం

By

Published : Aug 3, 2019, 7:28 PM IST

నాలుగో విడతహజ్​యాత్రకు భక్తులు ఇవాళ తరలివెళ్లారు.హైదరాబాద్ నాంపల్లిలోని హాజ్​హౌస్ నుంచి యాత్రకు బయల్దేరుతున్న బస్సును నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం హజ్​యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారని, ముఖ్యంగా మైనార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. హజ్​యాత్రకు వెళ్లే యాత్రికులు దర్శనం చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని సీపీ అకాంక్షించారు.

జెండా ఊపి హాజ్​యాత్ర బస్సును ప్రారంభించిన సీపీ

ABOUT THE AUTHOR

...view details