ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అవినీతి అధికారితోపాటు అతని తండ్రి, భార్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. గోల్నాక సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్గా గతంలో పనిచేసిన రమావత్ మోత్యా నాయక్పై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఆరోపణలు రావడం వల్ల.. 2002లో ఆయన నివాసం, కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.5కోట్లకు పైగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.
ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు శిక్ష..రూ. 20 వేల జరిమాన