సికింద్రాబాద్ బన్సీలాల్పేట్ పరిధిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు స్థానిక కార్పొరేటర్ కుర్మా హేమలత ఆపన్నహస్తం అందించారు. లాక్డౌన్ అమలు నుంచి స్థానికంగా ఉంటున్న వలస కార్మికులు, పేదలకు నిత్యావసరాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. రెండు పడక గదుల ఇల్లు నిర్మిస్తున్న వలస కూలీలు పడుతున్న అవస్థల గురించి తెలుసుకుని కర్పొరేటర్ వారికి చేయూత ఇస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె సూచించారు.
వలస కూలీలను ఆదుకుంటున్న కార్పొరేటర్ హేమలత - hemaltha distributed food to poor people due to corona and lockdown
బన్సీలాల్పేట్ పరిధిలో రెండు పడక గదుల ఇల్లు నిర్మిస్తున్న వలస కూలీలను స్థానిక కార్పొరేటర్ కుర్మా హేమలత ఆదుకున్నారు. వారికి నిత్యావసర సరకులు అందజేశారు.
![వలస కూలీలను ఆదుకుంటున్న కార్పొరేటర్ హేమలత corporator kurma hemalatha distributed food items at bansilalpet secundrabad hyderabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6891328-thumbnail-3x2-hyd.jpg)
వలస కూలీలను ఆదుకుంటున్న కార్పొరేటర్ హేమలత