భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ 70శాతానికిపైగా చైనా సంస్థలపైనే ఆధారపడి ఉంది. కొవిడ్-19 ప్రభావంతో చైనాలో స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి దాదాపు 12శాతం పడిపోయింది. భారతీయ మొబైల్ మార్కెట్లో 28 శాతంతో షామీ మొదటి స్థానంలో ఉండగా... వివో 21 శాతం, ఒప్పో 12శాతం, రియల్మీ 8శాతం, వన్ ప్లస్ 4శాతం మార్కెట్ను కలిగి ఉన్నాయి. చైనా మొబైళ్ల తర్వాత దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ మాత్రమే 19 శాతం మార్కెట్తో గణనీయమైన మార్కెట్ను కలిగి ఉంది.
చైనా ఉత్పత్తులపై పెను ప్రభావం
కొవిడ్-19 వైరస్ ప్రభావం చైనా ఉత్పత్తులపై పడింది. మెమోరీ కార్డులు, సెన్సర్లు, చిప్లు, ఇతర విడిభాగాల సంస్థలు.. కరోనా కేంద్రీకృతమైన వుహాన్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. చైనాలో చాలా సంస్థలు ఉత్పత్తి నిలిపివేశాయి. తమ నూతన ఉత్పత్తుల విడుదల ప్రణాళికలను సమీక్షించుకుంటున్నాయి.
భారత మార్కెట్లో శాంసంగ్ టాప్బ్రాండ్
మోడళ్ల కోసం బీఐఎస్లో రిజిస్ట్రేషన్లు, మార్కెట్ లాంచింగ్కు పోటీపడుతున్నాయి. ఒకప్పుడు భారత మార్కెట్లో టాప్బ్రాండ్గా ఉన్న శాంసంగ్ 2019 డిసెంబర్ నాటికి మూడోస్థానానికి పడిపోయింది.