జీహెచ్ఎంసీ పరిధిలో బుధవారం 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగరంలోని ముషీరాబాద్, మూసాపేట, సనత్ నగర్, మోతీనగర్, అల్లాపూర్ డివిజన్లలో కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. ముషీరాబాద్లో వృద్ధుడికి కరోనా నిర్ధారణకాగా... ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులను వైద్య పరీక్షల నిమిత్తం క్వారంటైన్కు తరలించారు. సనత్ నగర్ డివిజన్లోని సుభాష్నగర్లో 65 ఏళ్ల వృద్ధురాలికి కరోనా సోకింది. మహిళను ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రికి తరలించి.. కుటుంబసభ్యులను హోంక్వారంటైన్ చేశారు.
భాగ్యనగరంపై కరోనా పంజా... బుధవారం 26 కేసులు - తెలంగాణలో కరోనా కేసులు
భాగ్యనగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో బుధవారం 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భాగ్యనగరంపై కరోనా పంజా... బుధవారం 26 కేసులు
మూసాపేటలో తండ్రికొడుకులకు కరోనా సోకింది.. కుమారుడు ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మోతీనగర్లో కిరాణ దుకాణ నిర్వాహకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అల్లాపూర్లోని ప్రతాప్ నగర్లో బుధవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వ్యక్తిని కలిసిన ఆరుగురికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 38 కరోనా పాజిటివ్ కేసులు.. ఐదుగురు మృతి