తెలంగాణ

telangana

'వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను బతకను'

By

Published : Aug 7, 2020, 2:28 PM IST

ఆంధ్రప్రదేశ్​ శ్రీకాకుళం జీజీహెచ్​లో వైద్యుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. జీజీహెచ్​లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు.. 'వైద్యులు తమను పట్టించుకోవడం లేదని.. తాను చావుబతుకుల మధ్య ఉన్నాని, తన తల్లిని కాపాడాలని సెల్పీ వీడియోలో వేడుకున్నాడు.

'వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను బతకను'
'వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను బతకను'

'వైద్యులు పట్టించుకోవడం లేదు.. నేను బతకను'

ఏపీలోని శ్రీకాకుళం జీజీహెచ్​లో ఓ కరోనా రోగి బాధతో తీసిన సెల్ఫీ వీడియో హృదయాలను ద్రవింపజేస్తోంది. పాలకొండ మండలం వెలగవాడకు చెందిన సురేష్​కు కరోనా వైరస్​ సోకడం వల్ల ప్రస్తుతం జీజీహెచ్​లోనే చికిత్స అందిస్తున్నారు. వైద్యులు తమను పట్టించుకోవడం లేదని, ప్లేట్​లెట్స్ పడిపోయి.. నోరు, ముక్కులో నుంచి రక్తం కారుతోందని.. తానింక బతకనని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లిని కాపాడాలని సెల్ఫీ వీడియోలో వేడుకోవడం పలువురిని కలచి వేసింది.

ABOUT THE AUTHOR

...view details