తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్‌లో మరో 479 కరోనా కేసులు... - ఆంధ్రప్రదేశ్​ తాజా వార్తలు

గడిచిన 24 గంటల్లో ఏపీలో 62,215 కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 479 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం 4,355 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

corona new-cases-in-andhra pradesh
ఆంధ్రప్రదేశ్‌లో మరో 479 కరోనా కేసులు...

By

Published : Dec 19, 2020, 7:32 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 479 కరోనా కేసులు... మరో 4 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 8,78,285కు చేరింది. వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 7,074కు పెరిగింది. మహమ్మారి నుంచి మరో 497 మంది కోలుకోగా... ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8.66 లక్షలుగా ఉంది.

ప్రస్తుతం 4,355 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 62,215 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.

ఇదీచదవండి:సికింద్రాబాద్​లో‌ రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details