తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్​ బారిన 671 మంది బ్యాంకర్లు..! - latest news of corona effect in banking sector

బ్యాంకర్లనూ కరోనా భయం వెంటాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 671 మంది బ్యాంక్​ సిబ్బంది వైరస్​ బారిన పడగా.. ఇద్దరు మరణించారు. దానితో బ్యాంకర్లు తమ విధులు నిర్వర్తించడానికి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

corona effect on bankers
కొవిడ్​ బారిన... 671 మంది బ్యాంకర్లు..!

By

Published : Jul 14, 2020, 8:40 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ... బ్యాంకింగ్‌ రంగాన్ని కొవిడ్‌ కుదిపేస్తోంది. రోజురోజుకు వైరస్​ బారిన పడుతున్న బ్యాంకర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు చనిపోగా... 671 మంది వైరస్ బారిన పడ్డారు. అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన 188 మంది, భారతీయ స్టేట్‌ బ్యాంకుకు చెందిన 104 మంది, ఇండియన్‌ బ్యాంకుకు చెందిన 80 మంది, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 56, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు చెందిన 55 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు.

దీనితో విధులకు హాజరుకావడానికి బ్యాంకర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరు దీర్ఘకాలిక సెలవులు కూడా పెడుతున్నారు. హాజరైన వారు కూడా భయాందోళనతో తమ విధులు నిర్వర్తిస్తున్నారు. దూరం నుంచే ఖాతాదారులకు సేవలు అందిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు రాగానే సంబంధిత బ్యాంకు బ్రాంచి రెండు, మూడు రోజులు మూసివేస్తున్నారు. పూర్తి స్థాయిలో శానిటైజ్‌ చేసిన తరువాత తిరిగి తెరుస్తున్నారు.

ఇదీ చూడండి:బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details