తెలంగాణ

telangana

ETV Bharat / state

చవితి వెతలు... విగ్రహ తయారీదారుల ఆర్థిక కష్టాలు - హైదరాబాద్​లో వినాయక చవితి ఏర్పాట్లు

వీధి వీధినా భారీ పందిర్లు... ఊరు వాడల్లో ప్రత్యేక పూజలు.. చిన్నా పెద్ద కలిసి సందడిగా చేసుకునే వేడుక ఇలా చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే పండుగ వినాయకచవితి. కానీ కరోనా ప్రభావం వల్ల ఈ ఏడు వినాయక చవితి బోసిపోనుంది. భారీ విగ్రహాలను తయారు చేసిన విగ్రహ తయారీదారులు డీలాపడిపోతున్నారు. అమ్మకాలు లేక చేసిన విగ్రహాలు ఏమిచేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

lord ganesh idols manufacturers struggled with financial problems
విగ్రహ తయారీదారుల ఆర్థిక కష్టాలు... తీరేనా వారి ఇక్కట్లు

By

Published : Aug 11, 2020, 9:25 PM IST

Updated : Aug 12, 2020, 4:38 AM IST

చవితి వెతలు... విగ్రహ తయారీదారుల ఆర్థిక కష్టాలు

గల్లీ గల్లీలోన చిన్నా పెద్దా తేడా లేకుండా వైభవంగా చేసుకునే పండుగ వినాయక చవితి. పోటీపడి మరీ రకరకాల ఆకృతుల్లో, పరిమాణంలోను గణేశుడి విగ్రహాలు ప్రతిష్టించడం ఇప్పటివరకు చూసుంటాం.. కానీ కరోనా ప్రభావం వల్ల ఈ ఏడాది హాడావుడి లేకుండానే వేడుక జరుపుకోవాలని... మూడు అడుగులకు మించి విగ్రహాలు పెట్టొద్దనే ప్రభుత్వ సూచనతో పండుగ కళ తప్పనుంది.

చవితి కోసం విగ్రహ తయారీదారులు ఆరు నెలల ముందు నుంచే ప్రతిమల తయారీ మొదలెట్టారు. కరోనా తగ్గకపోతుందా.. పండుగ జరగకపోతుందా అనే నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులను రప్పించి మరీ బొమ్మలు తయారు చేశారు. కానీ కొవిడ్ ప్రభావం తగ్గకపోవడం వల్ల వారిది దిక్కుతోచని పరిస్థితి. లంబోదర మా పరిస్థితి ఏమిటి అంటు లబోదిబోమంటున్నారు.

భాగ్యనగరంలో విగ్రహాల తయారీకి పేరుగాంచిన ధూల్​పేట్ నుంచి భారీ సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు తీసుకువెళ్తారు. ఎప్పటిలాగానే ఈ ఏడు కూడా భారీ గణనాథులు, భారీ మొత్తంలో తయారు చేసి సిద్ధం చేసుకున్న వారికి ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :హైదరాబాద్ ప్రజల భయాందోళనపై నిపుణులు ఏం చెప్పారంటే?

Last Updated : Aug 12, 2020, 4:38 AM IST

ABOUT THE AUTHOR

...view details