తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో 252 మందికి కరోనా... 20 గంటల్లో 60 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసుల ఉద్ధృతి తీవ్రమైంది. తాజాగా 20 గంటల్లో 60 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 252కు చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి.

By

Published : Apr 5, 2020, 8:31 PM IST

corona-cases-reached-to-252-in-ap
ఏపీలో 252 మందికి కరోనా... 20 గంటల్లో 60 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయానికి ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 252గా నిర్ధరణ అయింది. కేవలం 20 గంటల్లో 60 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 9 నుంచి సాయంత్రం 5 వరకు 60 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొంది.

అత్యధికంగా ఇవాళ కర్నూలు జిల్లాలో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో దిల్లీలో మత ప్రార్థనలకు హాజరై వచ్చిన వారు, వారి సన్నిహితులే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. అంతేకాకుండా వారి సంబంధీకులు ఆరుగురికి ఈ వైరస్ సోకింది. వీరితో పాటు వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన మరో ఆరుగురు వ్యక్తులకు పాజిటివ్​గా తేలిందని హెల్త్​ బులెటిన్​లో పేర్కొన్నారు. మొత్తం బాధితుల్లో ఐదుగురు వ్యక్తులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు.

జిల్లాల వారీగా కేసులు:

ఏపీలో 252 మందికి కరోనా... 20 గంటల్లో 60 పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details