తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2020, 10:14 PM IST

ETV Bharat / state

జంటనగరాల్లో కోరలు చాస్తున్న కరోనా... భారీగా పెరుగుతున్న కేసులు

జంటనగరాల్లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటు సరిహద్దు జిల్లాల్లోనూ... భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కష్టనష్టాలకోర్చి పరీక్షలు చేయించుకుని పాజిటివ్​గా తేలినా... బాధితులను పట్టించుకునే వారే కరవవుతున్నారు. వేల సంఖ్యలో బాధితులు ఇళ్లలోనే ఉండి కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. యాంటీజెన్‌ పరీక్షలు పెద్దసంఖ్యలో చేస్తుండటం వల్ల పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా భారీగా నమోదవుతోంది. రోజురోజుకు మృతుల సంఖ్య సైతం అధికమవుతోంది.

corona cases increasing in hyderabad twin cities
జంటనగరాల్లో కోరలు చాస్తున్న కరోనా... భారీగా పెరుగుతున్న కేసులు

హైదరాబాద్‌ నగరంతో పాటు పరిసరాల్లోని మున్సిపాలిటీలు, మండలాల్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 80 శాతం కేసులు నమోదవుతున్నాయి. అంబర్‌పేట పరిధిలో ఇవాళ కొత్తగా 31 కేసులు వచ్చాయి. అంబర్‌పేట డివిజన్ పరిధిలో ఇద్దరు, కాచిగూడ డివిజన్​లో ఒకరు కొవిడ్​ బారినపడి చనిపోయారు.

పాతబస్తీ గల్లీల్లో కరోనా లొల్లి...

పాతబస్తీలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. చంద్రాయాణగుట్ట నియోజకవర్గంలో ఇవాళ మొత్తం 38 మందికి కరోనా నిర్ధరణ అయింది. వీటితో ఇప్పటి వరకూ ఒక్క చంద్రాయణగుట్ట పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 518కి చేరింది. రాజేంద్రనగర్ పరిధిలో 16 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఇప్పటివరకు మొత్తం కేసులు 365 కు చేరాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఇవాళ 181 కరోనా పరీక్షలు చేయగా అందులో 59 పాజిటివ్​గా తేలాయి.

కూకట్​పల్లిలో 54, జూబ్లీహిల్స్​లో 62...

సురారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 75 పరీక్షలు చేయగా 16, షాపూర్ నగర్​లో 65 మందికి పరీక్షలు నిర్వహించగా 27, కుత్బుల్లాపూర్​లో 18 మందిని పరీక్షించగా 11, గాజులరామరంలో 23లో ఐదుగురికి పాజిటివ్​గా తేలింది. సికింద్రాబాద్ నార్త్​జోన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 189 మందికి కరోనా పరీక్షలు జరపగా అందులో 22 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో కొత్తగా 33 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. కూకట్‌పల్లి పరిధిలో 54 కొత్త కేసులు వచ్చాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలో 62 మందికి కరోనా సోకింది.

మేడ్చల్​ జిల్లాలోనూ కరోనా ఉద్ధృతి...

ఇక మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలోని ఏరియా ఆస్పత్రిలో ఈరోజు 180 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... అందులో 42 మందికి పాజిటివ్ వచ్చింది. ఉప్పల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవాళ కరోనా పరీక్షలు ప్రారంభించారు. 36 మంది నమూనాలు సేకరించగా... 15 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది.

ఒకే కుటుంబంలో ఏడుగురికి...

రంగారెడ్డి జిల్లా పరిధిలో కూడా కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి. కందుకూరు మండలంలో ఒకే కుటుంబంలో ఏడుగురుకి కరోనా పాజిటివ్​గా తేలింది. కుటుంబంలో ఒకరికి శుక్రవారం నిర్ధరణ కాగా... ఇవాళ నిర్వహించిన పరీక్షల్లో మిగతా కుటుంబసభ్యులందరికీ కొవిడ్​ సోకింది.

కరోనా సోకిన 20 రోజులకు...

కందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 49 మందికి పరీక్షలు నిర్వహించగా... 9 మందికి పాజిటివ్‌గా తేలింది. యాచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా కరోనా పరీక్షలు ప్రారంభించి ఇవాళ 24 మంది నమూనాలు సేకరించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన జయమ్మ అనే 40 ఏళ్ల మహిళకు గత నెల 20 కరోనా సోకగా... ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఇవీ చూడండి:మీ ఇంటికే కరోనా కిట్.. హోం ఐసొలేషన్ బాధితులకు మాత్రమే..!

ABOUT THE AUTHOR

...view details