రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. గత నెల రోజుల్లోనే కేసుల సంఖ్య దాదాపు పదింతలు పెరిగిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా అన్నిచోట్ల కరోనా విస్తరిస్తోంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగానూ, జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగానూ కేసులుండేవి. ఇప్పుడు రెండుచోట్లా అదే పరిస్థితి కనిపిస్తోంది. గత నెల 6వ తేదీ నుంచి ప్రభుత్వం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయడం ప్రారంభించింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 99 ఆరోగ్య, తదితర కేంద్రాల్లో పరీక్షలు చేస్తున్నారు. గతంలో రోజుకు 400-500 నమూనాలే సేకరించేవారు. ఇప్పుడు రోజుకు 6 వేల నుంచి 7 వేల నమూనాలు తీసుకుంటున్నారు. అందువల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.
ఇంట్లో ఉండే జయిస్తున్నారు
వైరస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఇలాంటి వారు రంగారెడ్డి జిల్లాలో 6,128 మంది ఉన్నారు. మరో 5,183 మంది హోం ఐసోలేషన్ పూర్తిచేసుకొన్నారు.
పెరిగిన మరణాలు