తెలంగాణ

telangana

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 257 కరోనా కేసులు, ఒకరు మృతి

By

Published : Aug 29, 2021, 7:41 PM IST

రాష్ట్రంలో గడిచిన 24గంటల వ్యవధిలో కొత్తగా 257 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారిన ఒకరు మరణించారు. కరోనా నుంచి కొత్తగా 409 మంది కోలుకున్నారు.

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 257 కరోనా కేసులు, ఒకరు మృతి
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 257 కరోనా కేసులు, ఒకరు మృతి

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 58,335 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 257 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,57,376కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 3,870కి చేరింది.

ఒక్కరోజు వ్యవధిలో 409 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,47,5944కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,912 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: AP Corona: ఏపీలో కొత్తగా 1,557 కరోనా కేసులు, 18 మరణాలు

ABOUT THE AUTHOR

...view details