రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 87,355 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 420 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,52,135కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,841కి చేరింది.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 420 కరోనా కేసులు.. 3మరణాలు - telangana varthalu
రాష్ట్రంలో 24 గంటల్లో 87,355 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 420 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వైరస్ బారినపడి మరో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 420 కరోనా కేసులు.. 3మరణాలు
ఒక్కరోజు వ్యవధిలో 623 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,40,688కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,606 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదీ చదవండి:'కరోనా ఇంకా అంతం కాలేదు'