తెలంగాణ

telangana

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 420 కరోనా కేసులు.. 3మరణాలు

By

Published : Aug 14, 2021, 9:42 PM IST

రాష్ట్రంలో 24 గంటల్లో 87,355 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 420 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ వైరస్​ బారినపడి మరో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 420 కరోనా కేసులు.. 3మరణాలు
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 420 కరోనా కేసులు.. 3మరణాలు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 87,355 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 420 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,52,135కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,841కి చేరింది.

ఒక్కరోజు వ్యవధిలో 623 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,40,688కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,606 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి:'కరోనా ఇంకా అంతం కాలేదు'

ABOUT THE AUTHOR

...view details