ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 46,566 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కొవిడ్తో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,90,556కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు 7,173 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో కొత్తగా 115 కరోనా కేసులు - ఏపీ కరోనా తాజా సమాచారం
ఏపీలో కొత్తగా 115 కరోనా కేసులు నమోదుకాగా.. ఒకరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య 8,90,556కి చేరింది.
ఏపీలో కొత్తగా 115 కరోనా కేసులు
ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 93 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,82,462కి చేరింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 921యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,41,90,477 కరోనా శాంపిల్స్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్లో వెల్లడించింది.
ఇదీ చదవండి:లైవ్ వీడియో: ట్రాక్టర్ బీభత్సం... నలుగురికి గాయాలు