ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1,555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,814కి చేరింది. ఈ రోజు రాష్ట్రంలో కరోనాతో 13 మంది చనిపోయారు. వీరితో కలిపి ఇప్పటివరకు 277 మంది కరోనాతో మృతి చెందారు. ఈ రోజు నమోదైన కేసులలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 53 మంది కాగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు ఇద్దరు. రాష్ట్రానికి చెందివారు 1500 మంది. కరోనా నుంచి కోలుకొని ఈ రోజు మరో 904 మంది డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 10,894 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,555 కరోనా కేసులు - భారతదేశంలో కరోనా వైరస్
ఏపీలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరాయి. తాజాగా 13 మంది మృతి చెందగా... మెుత్తం మృతుల సంఖ్య 277కు చేరింది.

ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1,555 కరోనా కేసులు