రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రజానాట్యమండలి బృందం సభ్యుడు జగన్... కరోనాపై అవగాహన కల్పిస్తూ ఓ పాటను రాసి స్వయంగా తానే పాడాడు. కరోనా నివారణకు నిర్విరామంగా కృషిచేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులను అభినందిస్తూ ఆలపించిన పాట ఆకట్టుకుంటోంది. ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటిస్తూ కరోనా తరిమికొట్టాలని వారు కోరారు. కరోనా ఎంతటి ప్రమాదకరమో తెలియజేస్తూ పాడిన పాట ఆలోచింపజేస్తున్నది.
కరోనాపై ప్రజానాట్యమండలి కళాకారుల పాట
కరోనాపై అవగాహన కల్పించేందుకు కవులు, కళాకారులు ముందుకు రావాలన్న సీఎం కేసీఆర్ పిలుపునకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే కొందరు కళాకారులు పాటలు, కవితలు రూపొందించి విడుదల చేశారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ప్రజానాట్య మండలి బృందం ఓ కొత్త పాటను పాడింది.
కరోనా అవగాహన పాట