తెలంగాణ

telangana

ETV Bharat / state

సోషల్​ మీడియాలో వివాదాస్పద కామెంట్.. అల్లర్లు

సోషల్​ మీడియా ఎంత ఉపయోగపడుతుందో.. అంతే ప్రమాదం కూడా. సైబర్​ నేరగాళ్లు వివాదాలు సృష్టించేందుకు, డబ్బులు దోచుకునేందుకు, సామాజిక మాధ్యమాలను పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. తాజాగా సోషల్​ మీడియాలో పలువురు ఓ వివాదాస్పదమైన పోస్టు పెట్టి బెంగళూర్​లో మత అల్లర్లు సృష్టించారు. హైదరాబాద్​కు చెందిన వారిని పోలీసులు పట్టుకున్నారు.

By

Published : Aug 23, 2020, 5:31 PM IST

Controversial comments on social media riots at bangalore people arrested hyderabad
సోషల్​ మీడియాలో వివాదాస్పద కామెంట్.. అల్లర్లు

ఇటీవల బెంగళూర్​లో జరిగిన అల్లర్లకు సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పదమైన పోస్టులు పెట్టిన హైదరాబాద్​కు చెందిన ఏడుగురిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారం రోజుల క్రితం బెంగళూర్​లో ఓ మతాన్ని కించపరిచే విధంగా సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టారు. అవి కాస్తా ఉద్రిక్తతలకు దారి తీశాయి.

అది పక్క ప్రణాళిక ప్రకారం చేసినట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన మరుసటి రోజే హైదరాబాద్​లో పలువురు ఆ అల్లర్లకు సంబంధించిన పోస్టులను సామాజిక మాధ్యమాల్లో సర్క్యూలేట్ చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్​లోని సోషల్ మీడియా మానిటరింగ్ వింగ్ వాటిని గుర్తించి సైబర్​ క్రైమ్ పోలీసులకు తెలిపారు. దీంతో ఆయా పోస్టులను తొలగించారు. ఆ పోస్టులు పెట్టిన వారు ఏడుగురు ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఆ ఘటనపై మరింత దర్యాప్తు జరుపుతున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు.

ఇదీ చూడండి :'నిజమైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను ఇస్తున్నాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details